సమాజ సేవలో ప్రతి ఒక్కరు ముందుండాలి: సిరికొండ

811பார்த்தது
సమాజ సేవలో ప్రతి ఒక్కరు ముందుండాలి: సిరికొండ
సమాజ సేవలో ప్రతి ఒక్కరు ముందుండాలని మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫౌండర్ సిరికొండ విక్రమ్ కుమార్ అన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జివన్ రామ్ స్థాపించిన భారతీయ దళిత సాహిత్య అకాడమీ వారు ఎంవిఓ ప్రతినిధి పయ్యావుల ప్రవీణ్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి మహాత్మ జ్యోతిరావు పూలే నేషనల్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపిక చేసి ఈ నెల 11న ఢిల్లీలో అవార్డు బహుకరణ చేయడాన్ని హర్షిస్తూ గురువారం స్థానిక కార్యాలయంలో సంస్థ మండల అధ్యక్షుడు ఎండీ మాలిక్ అధ్వర్యంలో ప్రవీణ్ యాదవ్ ను సత్కరించారు. ఈ సందర్భంగా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో పేదలకు అండగా ఉండేవిధంగా, ప్రభుత్వ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందుడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు షరీఫ్, సాయినాథ్ చారి, చందు రెడ్డి, రాజేష్, రాజు, చరణ్, వెంకటరెడ్డి, ఆచారి, తరుణ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி