వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి

251பார்த்தது
వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి
తొర్రూరు మండలంలోని పోలేపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ శశాంక కు యువ రైతు పయ్యావుల ప్రవీణ్ యాదవ్ శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలో సుమారు 1330 ఎకరాల వ్యవసాయ భూమి రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం రబీ, ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటను గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం లేక పక్క గ్రామానికి తరలిస్తూ ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. కావున గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి రైతుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி