దేవరుప్పులలో విద్యుత్ షాక్ తగిలి ఆవు మృతి

66பார்த்தது
దేవరుప్పులలో విద్యుత్ షాక్ తగిలి ఆవు మృతి
విద్యుత్ షాక్ తగిలి ఆవు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన జనగాం జిల్లా దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఆదివారం బాధితుడు పంజాల ప్రసాద్ వివరాల ప్రకారం తనకున్న ఆవు మేత మేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. సుమారు ఒక లక్ష రూపాయల విలువ గల ఆవు మృతి చెందడంతో బాధిత రైతు కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

தொடர்புடைய செய்தி