సకాలంలో పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు

58பார்த்தது
సకాలంలో పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. ములుగు నియోజకవర్గం కొత్తగూడ మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల పంపిణీ కేంద్రాన్ని మంగళవారం డీఈఓ రామారావు సందర్శించారు. మండలంలో విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న పాఠ్య పుస్తకాల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி