మంగపేటలో భారీ వర్షం.. తాటి చెట్టుపై పిడుగు

530பார்த்தது
ములుగు జిల్లా మంగపేట మండలంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వాన గంట పాటు దంచికొట్టింది. ఈ క్రమంలో వాగొడ్డుగూడం గ్రామ పంచాయతీ పరిధి లక్ష్మీపురం గ్రామంలో తాటిచెట్టుపై పిడుగు పడి భారీగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల పూరి గుడిసెలు ఉండడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా కుండపోతగా కురవడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

தொடர்புடைய செய்தி