మహబూబాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపొందడం పట్ల ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు మంగళవారం సంబరాలు చేసుకున్నారు. బలరాం నాయక్ గెలుపు కోసం కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు, ఓట్లు వేసిన ప్రజలకు కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సారయ్య కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు సారంగం, రణధీర్, సురేష్, ఈరియా, వేణు తదితరులున్నారు.