కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

56பார்த்தது
మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా బుధువారం తనిఖీ చేశారు. పలు వార్డులు తిరిగి రికార్డులు పరిశీలించారు. నాణ్యమైన వైద్యం అందుతుందా అని రోగులను అడిగారు. డాక్టర్లు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కార్యక్రమంలో అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி