కాలినడకన శబరిమల యాత్రకు వెళుతున్న వెంకన్న

79பார்த்தது
కాలినడకన శబరిమల యాత్రకు వెళుతున్న వెంకన్న
జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఎడునూతుల గ్రామానికి చెందిన గాడిపెల్లి వెంకన్న కాలినడకన శబరిమల పాదయాత్రను చేపట్టారు. ఆదివారం ప్రత్యేక పూజలతో హైదరాబాద్‌లోని అమ్మవారి గుడి నుండి యాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర డిసెంబర్ 3న శబరిమల సన్నిధానానికి చేరుకోనుందని ఆయన తెలిపారు. 2002 లో కన్నె స్వామిగా ప్రారంభించిన తన ఆధ్యాత్మిక యాత్ర ఈ ఏడాది 22వ సారి చేపట్టడం విశేషం.

தொடர்புடைய செய்தி