కలెక్టర్ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యయత్నం

1067பார்த்தது
జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సోమవారం జనగాం మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు అనేవ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కలెక్టర్ బిల్డింగ్ పైకి ఎక్కి పురుగులమందు తాగాడని, తాముబతికి ఉన్నప్పటికీ చనిపోయారంటూ భూమిని ఇతరులకు పట్టాచేశారని ఈసంఘటనకు పాల్పడినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி