జూనియర్ అసిస్టెంట్ ఇట్టేమల్ల సోమయ్య-సంధ్య దంపతుల కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన ప్రజ్ఞాశాలిని (8) పాప గత వారం రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 8: 30 గంటల సమయంలో మృతి చెందినట్లు వారు తెలిపారు. దీనితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.