వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుంటే సీజ్

58பார்த்தது
వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుంటే ఇకనుంచి వాహనాలను సీజ్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని బుధవారం భూపాలపల్లి ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆదేశాల మేరకు, ఈ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జరిమానాలు విధిస్తే వాహనదారుల్లో మార్పు రావడంలేదని, ఇకనైనా వాహనదారులు తప్పక నెంబర్ ప్లేట్లు బిగించుకోవాలని, ఆయన సూచించారు. గురువారం నుంచే ఈ చర్యలు మొదలవుతాయన్నారు.

தொடர்புடைய செய்தி