ఉత్తరప్రదేశ్‌లో హింస.. షాపులు, ఆసుపత్రులకు నిప్పు (వీడియో)

59பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో దుర్గా విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఓ వ్యక్తి హత్య కలకలం రేపింది. ఆదివారం దుర్గా విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మహాసిలోని మహారాజ్‌గంజ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 30 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిరసనకారులు సోమవారం పలు దుకాణాలు, ఆసుపత్రులకు నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

தொடர்புடைய செய்தி