రాష్ట్రంలో జీబీఎస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ‘జీబీఎస్’ తో ఇద్దరు మరణించగా తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు కావడంతో వైద్యులు వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఈ క్రమంలో అధికారులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.