విషాదం.. రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

69பார்த்தது
విషాదం.. రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాల్వంచ మండలం భవానిపేట్ గ్రామానికి చెందిన గంగని రాములు (50) అనే రైతు వ్యవసాయ పనుల నిమిత్తం బైక్ పై వెళ్తూ.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రాములు తలకి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி