మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా జిల్లాలో తాజాగా విషాద ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల మరణించిన నేపథ్యంలో అంత్యక్రియల తరువాత కొంతమంది మహిళలు లఖుందర్ నదిలో స్నానానికి వెళ్లారు. వీరితో పాటు ముగ్గురు చిన్నారులు కూడా స్నానానికి దిగిన పిల్లలు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న SDERF సిబ్బంది పిల్లల మృతదేహాలను వెలికితీసినట్లు అధికారి తెలిపారు. మృతి చెందిన పిల్లలు మోను (7), అతని సోదరి ముస్కాన్ (8), వారి బంధువు పంకజ్ (7)గా పోలీసులు గుర్తించారు.