తనను 3 సార్లు చంపాలని చూశారని బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ కు ముందు పెగ్గు, తినడానికి లెగ్గు ఉంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. 4వ తేదీన నీకు 2 వైపులా డాక్టర్లను పెట్టుకో అని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించే పరిస్థితి రేవంత్ ప్రభుత్వానికి లేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు.