మాటు వేసి.. కాటు వేస్తున్నారు!

62பார்த்தது
మాటు వేసి.. కాటు వేస్తున్నారు!
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ జంట భార్యాభర్తలు కాదని తెలుసుకున్న దుండగులు, పక్క ప్లాన్ తో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే అత్యాచారాలు గతంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలలో అనేకం చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. గంజాయి, మద్యానికి అలవాటు పడ్డ కొందరు యువకులు ముఠాగా ఏర్పడి, గ్రామాల్లోని అమ్మాయిలు, ఒంటరిగా ఉండే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని వెలుగులోకి రావట్లేదని సమాచారం. బాధితులు ఫిర్యాదు చేసేలా, మృగాలకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி