దిష్టి తీసుకున్న సామాను బయటవేశారని గ్రామస్తులు దాడి, వ్యక్తి మృతి

551பார்த்தது
దిష్టి తీసుకున్న సామాను బయటవేశారని గ్రామస్తులు దాడి, వ్యక్తి మృతి
మెదక్ జిల్లాలోని గొల్లగూడెంలో అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తికి మహిళ దిష్టి తీసి వాటిని గ్రామంలో ఉన్న రోడ్డుపై వేసింది. ఇది గమనించిన గ్రామస్తులు వారిపై మండిపడుతూ అనారోగ్యంతో ఉన్న రాములు(65)తో పాటు ఇద్దరు మహిళలపై తీవ్రంగా దాడిచేశారు. ఆపై ఊరి నుండి వెళ్లిపోవాలని హుకుం జారీ చేయడంతో ముగ్గురూ గాయాలతో వర్షంలో గ్రామ శివారులోని ఓ చెట్టు కిందకు చేరారు. ఈ అమానవీయ సంఘటనలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మహిళలిద్దరూ చికిత్స పొందుతున్నారు.

தொடர்புடைய செய்தி