చికిత్స పొందుతూ 7 నెలల చిన్నారి మృతి చెందడంతో వైద్యుడిపై దాడి చేసిన కుటుంబీకులు

78பார்த்தது
చికిత్స పొందుతూ 7 నెలల చిన్నారి మృతి చెందడంతో వైద్యుడిపై దాడి చేసిన కుటుంబీకులు
పెద్దపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జ్వరానికి చికిత్స పొందుతూ 7 నెలల పాప గురువారం మృతి చెందింది. అయితే వైద్యుడి నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి చనిపోయిందంటూ ఆమె కుటుంబీకులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఈ క్రమంలో పాప తండ్రి ఖదీర్ బంధువులతో కలిసి వైద్యుడిపై దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి. హాస్పిటల్ లోని ఫర్నీచర్, ఇతర సామగ్రిని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనకు నిరసనగా శుక్రవారం జిల్లాలో సాధారణ, అత్యవసర వైద్య సేవలు నిలిపివేస్తున్నామని ఐఎంఏ ప్రకటించింది.

தொடர்புடைய செய்தி