తెలంగాణలోని కోచింగ్‌ సెంటర్లపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం

51பார்த்தது
తెలంగాణలోని కోచింగ్‌ సెంటర్లపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం
మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తెలంగాణ విద్యా వ్యవస్థలో తేవాల్సిన సంస్కరణలపై చర్చించింది. కోచింగ్‌ సెంటర్ల నిర్వహణలో పాటించాల్సిన మార్గదర్శకాలపై కూడా చర్చ జరిగింది. కేంద్ర మార్గదర్శకాలు రాష్ట్రంలో అమలు కావట్లేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కోచింగ్‌ సెంటర్లలో కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

தொடர்புடைய செய்தி