మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను కాంగ్రెస్, BRS అప్పుల రాష్ట్రంగా మార్చాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ 9 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందని, గ్రామాల్లో వీధి లైట్లు,రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఉందన్నారు. గతంలో కేసీఆర్ తన కుటుంబం కేంద్రంగా పాలన సాగిస్తే.. ఇపుడు రేవంత్.. సోనియా ఫ్యామిలీకి అనుకూలంగా పాలన సాగిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.