దసరాకు ఈ ప్రతిజ్ఞ చేయండి: మంత్రి పొన్నం (వీడియో)

68பார்த்தது
తెలంగాణలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీని నియంత్రణకు ఈ దసరాకు ఆయుధపూజ సమయంలో ఓ ప్రతిజ్ఞ చేయాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకుందామని పిలుపునిచ్చారు. ప్రమాదం చెప్పి రాదని.. జరిగాక ఎవరూ ఏమీ చేయలేరని, అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలన్నారు. మద్యం తాగి వాహనం నడపొద్దని సూచించారు. అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி