మోతె మండలంలో వరద ప్రాంతాలు పరిశీలించిన ఎమ్మెల్యే

85பார்த்தது
మోతె మండలంలో వరద ప్రాంతాలు పరిశీలించిన ఎమ్మెల్యే
వరద భీభత్సం రైతులకు తీవ్ర నష్టం కలిగించిందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. మంగళవారం మోతె మండలం నామవరం, కూడలి తదితర గ్రామాల్లో వరద కారణంగా నష్టపోయిన వరి పొలాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఇళ్ళు కూలి నష్టపోయిన రైతులకు ఇళ్ళు కట్టిస్తుందన్నారు. నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.

தொடர்புடைய செய்தி