గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: జిల్లా ఎస్పీ

81பார்த்தது
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: జిల్లా ఎస్పీ
గణేష్ నిమజ్జనం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం కోదాడ పెద్ద చెరువు వద్ద వినాయక నిమజ్జన స్థలాన్ని ఆయన పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్డిఓ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி