సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : షీ టీమ్ ఎస్ఐ

60பார்த்தது
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : షీ టీమ్ ఎస్ఐ
సైబర్ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని కోదాడ పట్టణ షీ టీమ్ ఎస్ఐ నీలీమ అన్నారు. మంగళవారం కోదాడ లో ఓ మాల్ లో పని చేసే మహిళలకు షీ టీమ్స్, సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. మహిళలపై వేధింపులు జరిగితే షీ టీం వాట్సాప్ నెంబర్ 8712686056 కు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలన్నారు. టీ సేఫ్ యాప్ పై మహిళలు అవగాహన కలిగి ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி