ఐపీఎల్ 2025 భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. వరుస ఓవర్లలో నితీశ్ కుమార్ రెడ్డి (32), అనికేత్ వర్మ (36) ఔట్ అయ్యారు. 15వ ఓవర్లో బిష్ణోయ్ బౌలింగ్ లో నితీశ్ కుమార్ రెడ్డి బౌల్డ్ అవ్వగా.. తరువాత ఓవర్లో అనికేత్ కూడా పెవిలియన్ చేరారు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ స్కోర్ 156/6గా ఉంది.