బ్రేక్ఫాస్ట్ మానేస్తే చాలా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రోజూ ఉదయం పూట తినకపోతే కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. టీనేజీ పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినకపోతే శరీర ఎదుగుదల అనేది సరిగా జరగదు. చదువులో ఏకాగ్రత చూపలేక మంచి ఫలితాలు కూడా సాధించకపోయే అవకాశం ఉంది. రోజూ బ్రేక్ఫాస్ట్ తినకుండా డైరెక్ట్ గా మధ్యాహ్నం భోజనం తింటే రక్తహీనత సమస్య వచ్చే ప్రమాదం ఉంది.