పాలకుర్తి: ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలి

58பார்த்தது
పాలకుర్తి: ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలి
ఆయిల్ ఫాం సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డి అన్నారు. శనివారం పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు. రైతులు కేవలం వరి, పత్తి పంటల పైనే ఆధారపడకుండా అధిక లాభాలు కలిగే ఆయిల్ పామ్ పై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనాథ్, ఉద్యానవన అధికారి జ్యోతి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி