ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరగాలి: ఎమ్మెల్యే

65பார்த்தது
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరగాలి: ఎమ్మెల్యే
ప్రశాంతమైన వాతావరణంలో గణేశ్ నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు.
ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మినీ ట్యాంకు బండ్ వద్ద నిమర్జన ఏర్పాట్లను రామగుండం కమిషనర్ సీపీ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి చేతన, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, పోలీస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி