గోదావరిఖని: రాష్ట్ర ఏర్పాటులో కాకా కృషి మరువలేనిది

65பார்த்தது
గోదావరిఖని: రాష్ట్ర ఏర్పాటులో కాకా కృషి మరువలేనిది
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి కృషి ఎంతో ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. శనివారం కాకా జయంతిని పురస్కరించుకొని గోదావరిఖని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో జీఎం కాలనీ మూల మలుపు వద్ద కాకా విగ్రహానికి ఎమ్మెల్యే నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కీలక పాత్ర పోషించారని చెప్పారు.

தொடர்புடைய செய்தி