కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి నివాళులు అర్పించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసిఎస్ రాజు కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కార్గిల్ విజయ్ దివస్ను గురువారం జగిత్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించి యుద్ధంలో అమరులైన వారికి నివాళులు అర్పించారు. సైనికుల త్యాగాలకు నివాళిగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.