వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: ఏఈ

77பார்த்தது
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: ఏఈ
ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ధర్మారం విద్యుత్ శాఖ ఏఈ మహ్మద్ ఖాసిం ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కరెంట్ స్తంభాల వద్దకు వెళ్లకుండా చూడాలని, గ్రామాలలో రైతులు తడిగా ఉన్న వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లను తాకవద్దని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత విద్యుత్ అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించగలరని ఏఈ ఖాసిం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி