పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

68பார்த்தது
పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
నిషేధిత భూమిలో ఇంటి నంబర్లు ఇవ్వడంతో పాటు అనుమతి ఇచ్చినందుకు పాశమైలారం పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ చారిని సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కోహిర్ లో పనిచేసిన సమయంలో వక్ఫ్ భూమిలో ఇంటి నెంబర్లు జారీ చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా లక్ష్మణ చారిని సస్పెండ్ చేసినట్టు డీపీవో చెప్పారు.

தொடர்புடைய செய்தி