విశిష్ట ప్రతిభా పురస్కారానికి ఎంపిక

51பார்த்தது
విశిష్ట ప్రతిభా పురస్కారానికి ఎంపిక
దుబ్బాక లచ్చపేట మోడల్ స్కూల్ పీజీటీ టీచర్ రాధారి నాగరాజు శాలివాహన విశిష్ట ప్రతిభా పురస్కారం- 2024 రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న టీచర్స్ శాలివాహన చారిటబుల్ ట్రస్టు ఈ అవార్డుకు ఎంపిక చేసిందని ఆయన శనివారం తెలిపారు. నాగరాజు 2016లో ఉమ్మడి మెదక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2019లో మహాత్మాపూలే ఉపాధ్యాయ అవార్డు, 2022లో జాతీయ స్థాయిలో స్వచ్ఛ విద్యాలయం పురస్కారం అందుకున్నారు.

தொடர்புடைய செய்தி