గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తన సోషల్ మీడియాలో "మ్యాచ్పైనే మా దృష్టి.. శబ్దం మీద కాదు" అంటూ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలు విరాట్ కోహ్లీకి కౌంటర్ అని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం, గిల్ ఔటైన సమయంలో విరాట్ కోహ్లీ ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకోవడం. దీంతో గిల్ చేసిన ఈ పోస్ట్ కోహ్లీ కోసమే అంటూ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.