సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 9వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.