సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పోచమ్మబస్తీ 19వ, వార్డులో గుంతల మయంగా మారింది. గతంలో గ్రామపంచాయతీ ఉన్నప్పుడు కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొన్నామని అని బొల్లారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ ఇమ్రాన్ అన్నారు. సోమవారం కమిషనర్ మంగతాయారుకి వినతి పత్రం అందజేశారు. తక్షణమే బస్తీలో పర్యటించి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవాలని కమిషనర్ ని కోరారు.