తమ పరిధిలోని వినాయక మండపాలను ప్రతి ఎస్సై సందర్శించాలని ఎస్పీ చెన్నూరి రూపేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండప నిర్వహకుల పేర్లు ఫోన్ నెంబర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. రాత్రి 10 గంటలకు మండపాన్ని మూసివేయాలన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.