సైదిరెడ్డి గెలుపు ఖరారు: అన్నామలై

38858பார்த்தது
సైదిరెడ్డి గెలుపు ఖరారు: అన్నామలై
నల్గొండలో కాషాయపు జెండా గెలుపు ఖరారు అయిందని తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. సైది రెడ్డికి మద్దతుగా సూర్యాపేటలో ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలో పాల్గొన్నారు. నల్గొండకు మోడీ సర్కార్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు. ఆ అభివృద్ధిని చూసే ఓటు వేయాలని సూచించారు. గ్రామాల్లో జరిగిన ప్రతి అభివృద్ధి కేంద్రం ఇచ్చిన నిధుల నుండే జరిగిందన్నారు. కాంగ్రెస్ ఉత్తుత్తి హామీలను నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్‌తో జరిగే అభివృద్ధి ఏమి లేదని కేవలం బూటకపు మాటలే అని తెలిపారు. ముచ్చటగా మోడీనే ప్రధాని అని ఘంటాపథంగా తేల్చి చెప్పారు.

தொடர்புடைய செய்தி