ట్రాక్టర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. షాకింగ్ వీడియో

561பார்த்தது
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఇసుక ట్రాక్టర్ ను ఢీకొట్టింది. వర్ధన్నపేట మండలం కట్ర్యాల వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాద ధాటికి ట్రాక్టర్ మూడుముక్కలైంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ డ్రైవర్, ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలుకావడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி