నాగ్ పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో బోగీల తగ్గింపు!

74பார்த்தது
నాగ్ పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో బోగీల తగ్గింపు!
సికింద్రాబాద్‌-నాగ్‌పుర్‌ వందేభారత్‌ రైలుకు ప్రయాణికుల ఆదరణ తగినంతగా లేకపోవడంతో బోగీల సంఖ్యను కుదించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ రైల్లో మొత్తం 20 బోగీలు ఉండగా 10కి పరిమితం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత నిర్ణయం అమలు చేసే అవకాశాలున్నాయని సమాచారం.

தொடர்புடைய செய்தி