యువత ధ్యానం, యోగావంటి సాధనాలతో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలనే లక్ష్యంతో జరుగుతున్న అంతర్జాతీయ యూత్ సెమినార్ కార్యక్రమానికి రాష్ట్రమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండల పరిధిలోని కన్హాశాంతి వనంలో శనివారం జరుగుతున్న కామన్వెల్త్ యునైటెడ్ సహకారంతో ఏర్పాటు చేశారు.