ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ప్రకటన చేసింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, 13 మంది గాయపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం బాధితులకు అందించామన్నారు. మృతి చెందిన 18 మంది కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2.5 లక్షల చొప్పున, స్వల్ప గాయాలపాలైన వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారం అందించామని పేర్కొంది. మొత్తం 33 మందికి పరిహారం అందజేశామని వెల్లడించింది.