బెంగళూరు మెట్రో స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం (వీడియో)

51பார்த்தது
బెంగళూరులోని జ్ఞానభారతి మెట్రో స్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. మెట్రో రైలు వస్తుండగా ట్రాక్‌పైకి అకస్మాత్తుగా దూకాడు. ఆ సమయంలో మెట్రో స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న రష్మీ అనే మహిళా ఉద్యోగి సకాలంలో స్పందించింది. వెంటనే మెట్రో పవర్‌ను నిలిపివేసింది. తర్వాత అతడిని మెట్రో సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో ఆ వ్యక్తి ఇలా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

தொடர்புடைய செய்தி