పుణెలో ఇటీవల ఓ టీనేజర్ మద్యం మత్తులో లగ్జరీ కారుతో బైక్ను ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి తాతను శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో నేరాన్ని తమ ఫ్యామిలీ డ్రైవర్పై మోపేందుకు నిందితుడి కుటుంబం ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.