ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి సినీనటుడు ప్రకాశ్ రాజ్ ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ప్రధాని మోదీ ఓ హెటల్లో బస చేసినా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదంట. ఓ హోటల్లో ప్రధాని మోదీ రూ.80.6 లక్షలు బాకీ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. 2023 ఏప్రిల్లో బెంగళూరు రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసి, బిల్లు కట్టాలని అడిగితే కట్టడం లేదన్న విషయాన్ని ప్రకాశ్ రాజ్ బయట పెట్టారు. ఈ మేరకు ఆయన ది హిందూలో వచ్చిన కథనం ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.