నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం పున:ప్రారంభం కానుంది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణిని అధికారులు నిలిపివేశారు. కాగా కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రజాభవన్లో మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాణి కొనసాగనుంది. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు తెలిపారు.