ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో పాక్ రెండో వికెట్ కోల్పోయింది. బౌలర్ ఎండ్ నుంచి అక్షర్ పటేల్ విరిసిన సూపర్ త్రోకు ఇమాన్ రనౌట్ అయ్యాడు. పవర్ ప్లే ఆఖరి ఓవర్ వేయడానికి కుల్దీప్ వచ్చాడు. అయితే రెండో బంతికి అనవసర పరుగుకు ప్రయత్నించి ఇమామ్ ఔటయ్యాడు. దీంతో ఇమామ్ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు.