జీబీఎస్ వ్యాధిపై ఎలాంటి ఆందోళనా అవసరం లేదని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఆయన ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జీబీఎస్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జీబీఎస్ రోగులకు సరిపడా ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. చాలావరకు చికిత్స తీసుకోకుండానే వ్యాధి తగ్గిపోతుందని చెప్పారు.