దొషులను కఠినంగా శిక్షించాలి: అర్బన్ ఎమ్మెల్యే

53பார்த்தது
దొషులను కఠినంగా శిక్షించాలి: అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాజులపేట బోయగల్లిలో వినాయకుని విగ్రహం ధ్వంసం జరిగిన స్థలాన్ని బుధవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ హిందూ సమాజం ఎంతో భక్తి శ్రద్దలతో పూజించే హిందువుల ఆరాధ్య దైవం అయిన వినాయకుని విగ్రహంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ధ్వంసం చేసిన దోషులకు కఠిన శిక్ష విధించాలని అన్నారు. ఎమ్మెల్యే వెంట బిజెపి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி